Nepal plane crash : నేపాల్ విమాన ప్రమాద ఘటనను భారతీయ ప్రయాణికుడు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే ప్యాసింజర్ మరికాసేపట్లో విమానం మంటల్లో చిక్కుకుంటుంది అనగా వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. అందులో అతను నవ్వుతూ కనిపించాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటుంది. ఆ తర్వాత నేలను ఢీకొని, మంటలు వ్యాపిస్తాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
పారాగ్లైడింగ్ కోసం..
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్కు చెందిన సోను జైస్వాల్(29) లిక్కర్ వ్యాపారి. అనిల్ రాజ్భర్ (28), విశాల్ శర్మ (23), అభిషేక్ సింగ్ (23)లతో కలిసి జనవరి 13న నేపాల్ రాజధాని ఖాట్మాండ్కు వెళ్లాడు. ఈ నలుగురు అక్కడి పశుపతినాథ్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పారాగ్లైడింగ్ చేసేందుకు పొఖార బయలుదేరారు. జనవరి 15 (ఆదివారం)న ఎతి ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్-72 (ATR-72) విమానం ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగడంతో 68మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది నేపాల్కు చెందిన వాళ్లే. మరణించిన వాళ్లలో రష్యా, కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ దేశస్థులు కూడా ఉన్నారు. రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు.
🚨Trigger Warning.
The guy who’s shooting this is from Ghazipur India. Moments before the crash. pic.twitter.com/hgMJ187ele
— Gabbar (@GabbbarSingh) January 15, 2023