సింగపూర్: సింగపూర్(Singapore)లో ఉన్న భారతీయ సంతతికి చెందిన జైలు వార్డెన్ ఓ కేసులో దోషిగా తేలాడు. ఖైదీని మరో జైలుకు తరలించేందుకు అతను ఓ ఖైదీ నుంచి సుమారు 83 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 56 ఏళ్ల కోబి కృష్ణ అయ్యావూ అనే వ్యక్తిపై విచారణ చేపట్టారు. జైలు వ్యవస్థకు చెందిన సిస్టమ్కు యాక్టివేట్ చేసేందుకు అతను తన తోటి ఉద్యోగుల్ని రెచ్చగొట్టినట్లు తేలింది. జనవరిలో దోషి కృష్ణకు చెందిన తుది తీర్పును జడ్జి వెలువరించనున్నారు.
కోబిపై మొత్తం 10 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. ఖైదీ చాంగ్ కెంగ్ చయ్ నుంచి అతను లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2015 సెప్టెంబర్ నుంచి 2016 మార్చి వరకు అతను లంచం తీసుకున్నాడు. కారు లోను ఇన్స్టాల్మెంట్, ఇంటి నిర్మాణం, బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అతను ఆ లంచాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
చాంగ్ అనే ఖైదీకి 2005లో 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. గర్ల్ఫ్రెండ్ కుమారుడిని వేధించిన కేసులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు. చాంగీ ప్రిజన్లోని ఏ1 క్లస్టర్ జైలులో అతన్ని బంధించారు. డబ్బులు ఇస్తే ఏ1 జైలు నుంచి తప్పించేందుకు కోబి ప్రామిస్ చేసినట్లు చాంగ్ దర్యాప్తులో పేర్కొన్నారు.