సాంగ్లీ: బ్రిటన్లోని మాంచెస్టర్ నగరంలో ఉన్న ఓ రెస్టారెంట్ బయట మహారాష్ట్రలోని సవ్లాజ్ గ్రామానికి చెందిన ఓ పాత ఇనుప కుర్చీ ఇటీవల కనిపించింది. కుర్చీ మీద ‘బాలు లోఖండే, సవ్లాజ్’ అని మరాఠీలో రాసి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్కు ఆ కుర్చీ ఎలా వెళ్లిందంటూ నెటిజెన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్లాస్టిక్ కుర్చీలకు డిమాండ్ పెరుగడంతో టెంట్హౌజ్ యజమాని అయిన బాలు.. 15 ఏండ్ల క్రితం ముంబైకి చెందిన ఓ వ్యక్తికి తుక్కు కింద ఈ కుర్చీని విక్రయించగా.. అది అక్కడి నుంచి మాంచెస్టర్కు చేరింది.