వాషింగ్టన్: అమెరికాలో భారత్కు చెందిన మరో విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఒహియోలోని యూనివర్సిటీ ఆప్ సిన్సినాటీ మెడికల్ స్కూల్లో చదువుతున్న ఢిల్లీకి చెందిన 26 ఏండ్ల ఆదిత్య అడ్లఖ దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. ఈ నెల 9న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్రన్ హిల్స్ వయాడక్ట్లో ఓ కారు గోడను ఢీకొట్టి ఆగిపోయింది. దాని నిండా బుల్లెట్ రంధ్రాలు ఉండడం, లోపల ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆదిత్యను దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించాడు.