వాషింగ్టన్: ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. లండన్, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయాలపై దాడికి పాల్పడిన ఖలిస్థానీవాదులు.. హైకమిషన్ భవనాలపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని కిందికి లాగేసిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్లో భారత్కు చెందిన జర్నలిస్ట్పై భౌతిక దాడికి పాల్పడ్డారు. అతనిపై దుర్భాషలాడారు. ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్కు (Amritpal Singh) మద్దతుగా కొందరు వ్యక్తులు వాషింగ్టన్లో (Washington) ఉన్న ఇండియన్ ఎంబసీ (Indian Embassy) వద్ద నిరసన వ్యక్తంచేస్తున్నారు.
అక్కడే పనిచేస్తున్న భారత జర్నలిస్ట్ (Journalist) లలిత్ కే ఝా (Lalit Jha) ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో లలిత్పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికిదిగారు. కర్రతో అతని చెవి కింద కొట్టారు. అక్కడితో ఆగకుండా అతనిపై దుర్భాశలాడారు. అయితే అక్కడే ఉన్న అమెరికా సీక్రెట్ సర్వీస్కు (US Secret Service) చెందిన సిబ్బంది అతడిని రక్షించారు.
తన విధిని నిర్వహించేందుకు సహాయపడిన సీక్రెట్ సర్వీస్ వారికి ధన్యవాదాలు. వారు కాపాడకపోయి ఉంటే నేను ఈ విషయాన్ని హాస్పిటల్లో ఉండి రాయాల్సి వచ్చేది. ఖలిస్థాన్ మద్దతుదారుల్లోని ఓ వ్యక్తి తనను ఎడమ చెవిపై రెండు కర్రలతో కొట్టాడని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఒక సందర్భంలో నన్ను బెదిరించారని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ హాండిల్లో లలిత్ పోస్ట్ చేశారు.
Thank you @SecretService 4 my protection 2day 4 helping do my job, otherwise I would have been writing this from hospital. The gentleman below hit my left ear with these 2 sticks & earlier I had to call 9/11 & rushed 2 police van 4 safety fearing physical assault👇. pic.twitter.com/IVcCeP5BPG
— Lalit K Jha ललित के झा (@lalitkjha) March 25, 2023