కాబూల్: ఆప్ఘనిస్థాన్లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక విమానం పంపించారు. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది. మజారె షరీఫ్ చుట్టుపక్కల ఉన్న భారతీయులంతా ఈ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చేయాలని అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.
ఈ ఫ్లైట్కు వచ్చే వాళ్లు వెంటనే పూర్తి పేరు, పాస్పోర్ట్ వివరాలు పంపించాలని వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లోని అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోతుండటంతో మళ్లీ తాలిబన్లు అక్కడి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దేశంలోని నాలుగో పెద్ద నగరమైన మజారె షరీఫ్ తమ తర్వాతి లక్ష్యమని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు.