రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు రష్యా.. ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు ఇంకా టెన్షన్కు గురవుతున్నారు. బంకర్లలో దాచుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే కొందరికి భారత ప్రభుత్వం అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో తరలించింది. ఇంకా ఆపరేషన్ గంగ కొనసాగుతోంది.
అయితే.. 694 మంది భారత వైద్య విద్యార్థులు.. సుమీ అనే ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈ ప్రాంతం రష్యా బార్డర్కు దగ్గర్లో ఉంటుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి 350 కిమీల దూరంలో ఉంటుంది. అక్కడ చిక్కుకుపోయిన ఆ విద్యార్థులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కేంద్రం స్పష్టం చేసింది.
బస్సుల్లో వాళ్లను పొల్టావా అనే ప్రాంతానికి తరలించారని.. సుమీలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. అక్కడి నుంచి వాళ్లను వెస్టర్న్ ఉక్రెయిన్కు తరలించి విమానాల్లో భారత్కు తీసుకురానున్నారు.
Happy to inform that we have been able to move out all Indian students from Sumy.
They are currently en route to Poltava, from where they will board trains to western Ukraine.
Flights under #OperationGanga are being prepared to bring them home. pic.twitter.com/s60dyYt9U6
— Arindam Bagchi (@MEAIndia) March 8, 2022
సుమీలో చిక్కుకున్న భారత విద్యార్థులు చాలా రోజులుగా సాయం కోసం ఎదురు చూశారు. అక్కడి గడ్డకట్టే చలిని తట్టుకోలేక, తిండితిప్పలు లేక.. ఎలాగైనా రష్యా బార్డర్ చేరుకోవాలని అనుకున్నారు. తమ కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం.. విదేశాంగ శాఖ సాయంతో వాళ్లను తాజాగా అక్కడి నుంచి బస్సుల్లో పొల్టావా తరలించారు.
We have already started the evacuation of civilians from Sumy to Poltava, including foreign students.
We call on Russia to agree on other humanitarian corridors in Ukraine.#Ukraine #StopRussianAggression pic.twitter.com/pmjhHLkIrH
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 8, 2022