ఖార్కీవ్ లో ఉన్న భారతీయ విద్యార్థులందరూ తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భారత ఎంబసీ మరోమారు సూచించింది. బుధవారం సాయంత్రం కల్లా పెసోచిన్, బాబే, బెజ్లియుడోవా వైపు తరలి వెళ్లాలని భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా సూచించింది. కేవలం నాలుగు గంటల్లోగా ఖార్కీవ్ను ఖాళీ చేయాలని ఎంబసీ పేర్కొంది. ‘ఖార్కీవ్లోని భారతీయ విద్యార్థులందరీ ముఖ్య సూచన. వారి వారి రక్షణ కోసం ఖార్కీవ్ను తక్షణమే వదిలి వెళ్లాలి. సాయంత్రం 6 గంటల కల్లా వదిలి వెళ్లండి. పెసోచిన్, బాబే, బెజ్లియుడోవ్కా వైపు వీలైనంత త్వరగా వెళ్లండి.’ అంటూ భారత ఎంబసీ సూచించింది.
ఉక్రెయిన్లో రష్యా దాడులను ఉధృతం చేసింది. రాజధాని కీవ్ సహా ఖార్కీవ్ వంటి పెద్ద పట్టణాలు బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాలు, భారీగా ఎగసిపడుతున్న పొగలతో భీతావహ దృష్యాలు కనిపిస్తున్నాయి. దేశంలో రెండో పెద్ద పట్టణమైన ఖార్కీవ్పై (Kharkiv) రష్యన్ వైమానిక దళం పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో 21 మంది మృతిచెందగా, వంద మందికిపైగా గాయపడ్డారు. నగరంలోని ఓ ప్రసూతి దవాఖానపై (Maternity home) వైమానిక దళం గుండ్ల వర్షం కురిపించడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు.