భారత్ను రెండు వందల సంవత్సరాల పాటు పాలించిన బ్రిటిష్ పాలకులు.. ఎన్నో అద్భుతమైన వస్తువులను ఇక్కడి నుంచి దోచుకెళ్లారు. ఆ తర్వాత వీటిని తమవిగా చెప్పుకుంటూ మ్యూజియాలకు అప్పగించారు. ఇలా స్కాట్లాండ్లోని గ్లాస్గో మ్యూజియంకు అందించిన ఏడు వస్తువులను అధికారులు భారత్కు తిరిగి అప్పగించారు. గ్లాస్గో లైఫ్ సంస్థతో భారత హై కమిషన్ ప్రతినిధులు 18 నెలలపాటు చర్చించిన అనంతరం.. ఈ వస్తువులను భారత్కు అప్పగించడానికి అధికారులు అంగీకరించారు.
ఇప్పుడు భారత్కు అప్పగించిన ఏడు వస్తువుల్లో ఆరు 1800ల్లో దోచుకున్నవి కాగా.. మరొకదాన్ని యజమానుల నుంచి దొంగిలించిన తర్వాత ఆ దొంగల నుంచి కొనుగోలు చేశారు. ఇకపై కూడా ఇలాంటి చర్చలు జరుపుతూనే ఉంటామని, భారత్ నుంచి దోచుకెళ్లిన వస్తువులను తిరిగి స్వదేశానికి చేర్చేందుకు ప్రయత్నిస్తామని హైకమిషన్ ప్రతినిధులు తెలిపారు.
VIDEO: A museum in Glasgow performs a handover ceremony to return seven items that were stolen from India during the Colonial era to the country. pic.twitter.com/ofVwKyzD4e
— AFP News Agency (@AFP) August 22, 2022