వెల్లింగ్టన్: పల్లెల్లో కనిపించే నులక మంచాన్ని సాధారణంగా ఇంట్లోనే అల్లుతుంటారు. ఒకవేళ బయట దీన్ని తయారు చేయించాలంటే రూ.మూడు వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, న్యూజిలాండ్కు చెందిన ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థ అనాబెల్.. భారత్కు చెందిన ఓ నులక మంచాన్ని ఏకంగా రూ. 41,297కు అమ్మకానికి పెట్టింది. వాస్తవానికి మంచం ఖరీదు రూ. 61,980 అయినప్పటికీ, వినియోగదారులను ఆకర్షించడానికి రూ. 20 వేల డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.