Imran Khan | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలకొని సంవత్సరం పూర్తైంది. అయినా అక్కడ యుద్ధ
వాతావరణం మాత్రం ఇంకా చల్లారనేలేదు. గత ఏడాది మొదట్లో ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన
క్రెమ్లిన్.. అప్పటి నుంచి క్లిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న
వివాదంపై పలు దేశాలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఎక్కువ దేశాలు ఉక్రెయిన్కు అనుకూలంగా
మాట్లాడుతుండగా.. మరికొన్ని దేశాలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. ఇందులో భారత్ కూడా ఒకటి.
కాగా, ఈ వివాదంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ తాజాగా స్పందించారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోందని చెప్పారు. ఇదే సందర్భంలో పాకిస్థాన్
వైఖరి ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. ‘నేను ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా పర్యటనకు వెళ్లి
తిరిగొచ్చా. అప్పటి సైనిక జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించాలని నన్ను
కోరారు. అందుకు నేను అంగీకరించలేదు. భారత్ ఈ విషయంలో తటస్థంగా ఉంది. పాకిస్థాన్ కూడా
అలాగే వ్యవహరించాలని సైనిక జనరల్కు సూచించా’ అంటూ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత, అమెరికా మెప్పు పొందేందుకు జనరల్ బజ్వా ఓ అడుగు ముందుకేసి ఓ సైనిక సదస్సులో
మాట్లాడుతూ ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రకటన చేశాడని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.
అంతేకాదు, తాను ప్రధాని పదవి నుంచి దిగిపోవడానికి కుట్ర చేసిన వారిలో జనరల్ బజ్వా కీలక సూత్రధారి
అని ఇమ్రాన్ ఆరోపించారు.