కీవ్: రష్యా దాడులతో ఉక్రెయిన్లోని కీవ్ నగరం దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. అయితే కీవ్లో చిక్కుకున్న పాకిస్థాన్ అమ్మాయి అస్మా షఫీక్ను భారతీయ అధికారులు రక్షించారు. కీవ్ నగరం నుంచి అస్మాను ఇండియన్ ఎంబసీ బయటకు తీసుకువచ్చింది. ఇప్పుడు ఆమె పశ్చిమ ఉక్రెయిన్ వైపు పయనిస్తోంది. కీవ్ నుంచి సురక్షితంగా తరలించినందుకు అస్మా భారతీయ అధికారులకు థ్యాంక్స్ చెప్పింది. ప్రధాని మోదీ ఇచ్చిన సపోర్ట్కు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే ఆ అమ్మాయి తన కుటుంబసభ్యులను కలుసుకోనున్నది. కీవ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ వల్లే తాను ప్రాణాలతో ఆ నగరాన్ని దాటినట్లు ఆమె తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఆపరేషన్ గంగాలో భాగంగా.. బంగ్లాదేశీతో పాటు నేపాలీ వ్యక్తుల్ని కూడా ఇండియన్ ఎంబసీ రక్షించింది.