కొలంబో, ఆగస్టు 15 : శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప్రాయపడుతున్నది. భారత నావికా దళం వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ గొర్మాడే శ్రీలంక పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా సముద్రగస్తీ విమానాన్ని అక్కడి కటునాయకే ఎయిర్ఫోర్స్ బేస్ వద్ద శ్రీలంకకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా పాల్గొన్నారు. భారత్ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా హంబన్తోట పోర్టుకు చైనా నౌక వచ్చేందుకు కొలంబో అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.