కైవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో వందల సంఖ్యలో భారత విద్యార్థులు రాజధాని కైవ్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కొందరికి ఎంబసీలో వసతి కల్పించారు. అలాగే సుమారు 200 మందికిపైగా విద్యార్థులను ఎంబసీ సమీపంలోని స్కూల్లో వసతి కల్పించినట్లు భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులోని పొరుగు దేశాల ద్వారా భారతీయల తరలింపుపై విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అయితే పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమన్నారు. ప్రతి భారతీయుడు స్వదేశానికి చేరేవరకు ఎంబసీలో కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేశారని, దీంతో విపరీతమైన రద్దీ నేపథ్యంలో రోడ్లు, రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడిందని భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులంతా ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్న వారు నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కైవ్లో ఎవరైనా చిక్కుకున్నట్లయితే స్నేహితులు, కుటుంబాలు, భారతీయ సంఘం సభ్యులు, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఉక్రెయిన్లోని భారతీయుల భద్రత కోసం కైవ్లోని భారత రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
Embassy of India in Ukraine accommodates more than 200 Indian students at school near the Embassy in Kyiv
(Source: Embassy of India in Kyiv, Ukraine) pic.twitter.com/5aTjObCvN7
— ANI (@ANI) February 24, 2022