వాషింగ్టన్, అక్టోబర్ 22: భారత్తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో 2022లో చైనా వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) వెంట బలగాల మోహరింపును పెంచిందని, అదేవిధంగా సరిహద్దు ప్రాంతా ల్లో పెద్దయెత్తున మిలటరీ నిర్మాణాలు కొనసాగించిందని అమెరికా రక్షణ శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది.
డోక్లాం సమీపంలో అండర్ గ్రౌండ్ స్టోరేజీ సదుపాయాలు నిర్మించిందని, ఎల్ఏసీలోని మూడు సెక్టార్ల పరిధిలోని రోడ్లు, అదేవిధంగా ప్యాంగ్యాంగ్ సరస్సుపై రెండవ బ్రిడ్జి, సైనిక-పౌర అవసరాలకు వినియోగించే విమానాశ్రయం, పలుచోట్ల హెలిప్యాడ్లు, భూటాన్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో కొత్త గ్రామాల నిర్మాణాలు చేపట్టిందని పెంటగాన్ తెలిపింది. చైనా 2022లో ఎల్ఏసీ వద్ద ఒక బోర్డర్ రెజిమెంట్ను మోహరించిందని పేర్కొన్నది. దీనికి తోడు జిన్జియాంగ్, టిబెటట్ మిలటరీ డిస్ట్రిక్ట్స్కు చెందిన రెండు డివిజన్లు, వీటితోపాటు నాలుగు కంబైన్డ్ అర్మ్స్ బ్రిగేడ్స్(సీఏబీ)లను వెస్టర్న్ సెక్టార్లో రిజర్వ్లో ఉంచినట్టు వెల్లడించింది. అదేవిధంగా చైనా వద్ద ప్రస్తుతం 500 న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నాయని, 2023 నాటికి అవి వెయ్యికి పైగా చేరే అవకాశం ఉన్నదని పెంటగాన్ తన నివేదికలో అంచనా వేసింది.