కాబూల్ : ఇండియా మాకు ముఖ్యమైన దేశం.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వారికి ఎలాంటి ముప్పు ఉండదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్థాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. తమ పాలనలో కూడా భారత్తో మంచి సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.
భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్తో ఆఫ్ఘనిస్థాన్ చేతులు కలుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయని జబిహుల్లాను రిపోర్టర్ ప్రశ్నించగా.. ఆ వార్తలు నిరాధారమైనవి అని కొట్టిపారేశారు. తాము భారతదేశానికే కాదు ఏ దేశానికి కూడా హానీ కలిగించము. తమ వైపు నుంచి ఇండియాకు ఎలాంటి ముప్పు ఉండదు అని హామీ ఇస్తున్నట్లు జబీహుల్లా స్పష్టం చేశారు.
ఆగస్టు 26న జబీహుల్లా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ను తమ రెండో హోమ్గా తాలిబన్లు చూస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్తో ఆఫ్ఘన్ సరిహద్దులు పంచుకుంటున్నాయి. మతం విషయానికి వస్తే మేము సంప్రదాయబద్ధంగా ఉంటాము. రెండు దేశాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసిపోతారు. కాబట్టి పాకిస్తాన్తో సంబంధాలు మరింత బలపడటం కోసం మేము ఎదురుచూస్తున్నాము అని జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
ఇతర దేశాల రాయబార కార్యాలయాలు ఆఫ్ఘనిస్థాన్లో ఉండాలని తాలిబన్లు కోరుకుంటున్నట్టు ముజాహిద్ చెప్పారు. అన్ని దేశాలు తమ దేశంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇతర దేశాల రాయబారులకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.