వాషింగ్టన్: ఒక రోగికి పంది కిడ్నీ మార్పిడి చేశారు. (Pig Kidney To Patient) ప్రపంచంలో తొలిసారి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. ఒక రోగికి పంది కిడ్నీని విజయవంతంగా మార్పిడి చేసినట్లు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ గురువారం తెలిపింది. కిడ్నీలు ఫెయిల్ అయిన 62 ఏళ్ల రోగికి శనివారం నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసి పంది కిడ్నీని అమర్చినట్లు పేర్కొంది. ఆ వ్యక్తి కోలుకుంటున్నాడని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వెల్లడించింది.