మాస్కో: యుద్ధంలో గెలవాలంటే… అంటూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్పై అణుబాంబులు వేయడం గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తావించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో సంభాషణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబులు వేయడంతో ఆ దేశం లొంగిపోయిందని, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందని గుర్తు చేశారు. యుద్ధంలో గెలవాలంటే పెద్ద నగరాలపై దాడి చేయాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా అన్నారు. దీంతో పుతిన్ వ్యాఖ్యలపై పశ్చిమ దేశాల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా అణు దాడి చేయవచ్చని అనుమానిస్తున్నారు.
కాగా, ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా కొనసాగిస్తున్నది. ఆ దేశం అణుధార్మిక స్మార్ట్ బాంబ్ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నది పుతిన్ ఇటీవల ఆరోపించారు. ఇదే జరిగితే అణు బాంబుల దాడికి తాము వెనుకాడబోమని హెచ్చరించారు. అయితే పుతిన్ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. అణు దాడి ఆలోచన ఉన్నవాళ్లే ఇతరులపై అలాంటి ఆరోపణలు చేస్తారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా విమర్శించారు.