న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. న్యూయార్క్ ట్రయల్ కోర్టులో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ బిజినెస్కు చెందిన కేసులో ఆయన జడ్జితో వాదించారు. పదేపదే జడ్జిను తప్పుపట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారు. సుమారు నాలుగు గంటల పాటు ట్రంప్.. కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. తానేమీ బ్యాంకులను మోసం చేయలేదన్నారు. ట్రంప్ సంస్థ తమ ఆస్తులను విలువను అధికంగా చూపి, బ్యాంకుల వద్ద నుంచి అధిక మోతాదులో రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ట్రంప్ సంస్థపై 250 మిలియన్ల డాలర్ల జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ట్రంప్ కోర్టు విచారణకు హాజరయ్యారు.
మన్హటన్ ఫెడరల్ కోర్టురూమ్లో ఆయన విచారణ ఎదుర్కొన్నారు. ఫ్లోరిడాలోని మార్ఏ లాగో ఎస్టేట్, న్యూయార్క్లోని ట్రంప్ టవర్, స్కాట్లాండ్లోని గోల్ఫ్ కోర్స్ ప్రాపర్టీల విలువ ఎంతో చెప్పాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేశారు. తన విలువ బిలియన్ల డాలర్లు ఉంటుందని ట్రంప్ కోర్టులో తెలిపారు. తన పర్సనల్ ఇమేజ్తో ప్రాపర్టీ ఆస్తుల విలువ పెరిగినట్లు చెప్పారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లిటిటా జేమ్స్ ఈ కేసును దాఖలు చేశారు. ట్రంప్ కంపెనీ తమ ఆస్తుల విలువను అధికంగా చూపించినట్లు అటార్నీ తన కేసులో ఆరోపించారు.