న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్లో 18 ఏండ్ల బాలిక 78 ఏండ్ల వ్యక్తిని వివాహం చేసుకున్న ఉదంతం ఈ వారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇదే తరహా మరో ఘటనలో తనకంటే 30 ఏండ్ల చిన్నవాడైన మసాయి తెగకు చెందిన వ్యక్తి కోసం ఓ మహిళ ఏకంగా తన ఇంటి నుంచి 14,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వైనం ఆన్లైన్లో పలువురి దృష్టిని ఆకట్టుకుంది. దెబోరా బాబు అనే మహిళ (60) తన కూతురుతో కలిసి 2017 అక్టోబర్లో టాంజానియాలో ప్రయాణిస్తుండగా సైటోటి బాబుతో పరిచయం ఏర్పడింది.
జంజిబర్లోని బీచ్లో వారు సైటోటి బృందం కంటపడగా వారికి సైటోటి, ఇతర గిరిజన తెగ యువకులు కొన్ని సావనీర్లు ఆఫర్ చేయగా వాటిని తిరస్కరించిన దెబోరా వారిని తమతో ఫోటో తీసుకోవాలని కోరింది. అలా వారిద్దరి మధ్య మొదలైన పరిచయం క్రమంగా రొమాంటిక్ రిలేషన్షిప్కు దారిఈసింది. సైటోటి ఆపై దెబోరా ఆమె కూతురు జోస్ తదుపరి గమ్యస్ధానికి వారి వెంట వెళ్లాడు. దెబోరా అమెరికా చేరుకున్న తర్వాత సైటోటి నుంచి పెండ్లి ప్రతిపాదన వచ్చింది. పిల్లల ప్రమేయంతో దెబోరా డిసెంబర్లో తిరిగి టాంజానియా వచ్చింది.
ఆ సమయంలో సైటోటి ఆమెకు ప్రపోజ్ చేయగా జూన్ 2018న గిరిజన మసై తెగ సంప్రదాయంలో వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వారి వివాహానికి ఈ ఏడాదే చట్టబద్ధత లభించింది. తనకంటే బాగా చిన్నవయసు కలిగిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని తాను ఎన్నడూ ఊహించలేదని, అయితే అతడు చాలా దయగల వాడని, తనను బాగా చూసుకుంఆడని దెబోరా చెప్పుకొచ్చింది. వయసు వ్యత్యాసం పక్కనపెడితే తాము తమ సంతోషం, జీవితాన్ని ఆస్వాదించడం పైనా దృష్టిసారించామని పేర్కొంది.