ఇస్లామాబాద్ : యాదాది దేశం పాక్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లేకుండా ఆదివారం డెప్యూటీ స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇమ్రాన్ పార్లమెంట్ను రద్దు చేస్తూ ఈ మేరకు అధ్యక్షుడికి ప్రతిపాదనలు పంపారు. ఈ వ్యవహారంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. ప్రతిపక్ష పార్టీలు పాక్ సుప్రీం కోర్టు తలుపు తట్టగా.. ఇవాళ కోర్టు విచారణ చేపట్టనున్నది. ఈ మేరకు పాక్ అటార్నీ జనరల్కు కోర్టు నోటీసులు పంపిందని పాక్ మీడియా పేర్కొంది. మరో వైపు అపద్ధర్మ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ఖాన్ కొనసాగనున్నారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు పాక్ అధ్యక్షుడి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.