ఇస్లామాబాద్, నవంబర్ 3: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగింది. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. పాక్ పంజాబ్లోని వజీరాబాద్ అల్లావాలాచౌక్లో నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇమ్రాన్ కాలికి తూటా తగిలింది. ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురికి కూడా తూటాలు తగిలాయి. ఇమ్రాన్ను వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకొంటున్నారని జియోటీవీ తెలిపింది. ఇమ్రాన్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్ను లాహోర్కు తరలిస్తున్నట్టు వెల్లడించాయి. ఘటనాస్థలిలోనే నిందితుడిని పట్టుకొన్న పార్టీ కార్యకర్తలు అతడిని పోలీసులకు అప్పగించారు. ప్రజలను ఇమ్రాన్ఖాన్ తప్పు దారి పట్టిస్తున్నారని, అందుకే చంపాలని దాడికి పాల్పడ్డానని నిందితుడు ఒప్పుకొన్నాడు. తాను ఏ పార్టీకి, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని కాదని స్పష్టం చేశాడు.