ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉప ఎన్నికల్లో స్టన్నింగ్ ప్రదర్శన ఇచ్చింది. పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో 20 సీట్లలో పీటీఐ పార్టీ 15 సీట్లను కైవసం చేసుకున్నది. ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి పీఎంఎల్-ఎన్ పార్టీని ఇమ్రాన్ పార్టీ ఓడించింది. ఈ నేపథ్యంలో దేశంలో తక్షణమే జాతీయ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే వచ్చే ఏడాది అక్టోబర్లో జరగనున్న జాతీయ ఎన్నికలపై ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏప్రిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో ఇమ్రాన్ ఖాన్ ఓడిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధాని షేబాజ్ షరీఫ్ .. పీఎంఎల్-ఎన్ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. పంజాబ్ ఓటమి ఆయనకు ఇప్పుడు పెను సమస్యగా మారింది. పంజాబ్లో కేవలం నాలుగు సీట్లను మాత్రమే ఆ పార్టీ గెలుచుకున్నది. మరో సీటను ఇండిపెండెంట్ ఎగురేసుకపోయారు.