ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు రావాల్పిండి అధికారులు మొండి చెయ్యి చూపారు. సిటీలోని పరేడ్ గ్రౌండ్లో ఇమ్రాన్ హెలికాప్టర్కు ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఇమ్రాన్పై తుపాకీతో కాల్పుల దాడి జరిగిన విషయం తెలిసిందే. బుల్లెట్ల గాయం నుంచి కోలుకుంటున్న ఇమ్రాన్ తొలిసారి మళ్లీ పబ్లిక్ మీటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ రావల్పిండి ప్రభుత్వాధికారులు ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీ నేత అసద్ ఉమర్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ హెలికాప్టర్ ల్యాండింగ్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు.