ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి కోర్టు బుధవారం 14 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇప్పటికే జైలులో ఉన్న ఆయనకు అధికార రహస్యాలు వెల్లడించిన కేసులో మంగళవారం 10 ఏండ్ల జైలు శిక్ష పడింది. అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే తోషఖానా కేసులో ఈ శిక్ష విధించడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని భావిస్తున్నారు.