బీజింగ్: ఒకవేళ అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు వెళ్తే, అప్పుడు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం రోజున పెలోసీ మలేషియాలో గడిపారు. ఆసియా టూర్లో ఉన్న నాన్సీ .. తైపెయి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య కొన్నాళ్ల నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ను తమ భూభాగం చైనా భావిస్తోంది. ఆ ప్రాంతానికి నాన్సీ వెళ్లడాన్ని రెచ్చగొట్టే చర్యగా భావిస్తామని చైనా పేర్కొన్నది.