జెరుసలాం : ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడి చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ కదనరంగంలోకి దూకింది. ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా దాడులు కొనసాగించింది. ఇరాన్పై వార్ మొదలై నెల దాటింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ రక్షణ దళం(IDF) కీలక ప్రకటన చేసింది. ఇరాన్పై గత నెల రోజుల నుంచి సుమారు 800కి పైగా దాడలు చేసినట్లు చెప్పింది. ఆ దాడుల వల్ల సుమారు రెండు వేల మంది ఇరానీ బలగాలు మృతిచెందినట్లు ఐడీఎఫ్ చెప్పింది. 800 వైమానిక దాడుల కోసం సుమారు 16,000 పేలుడు పదార్ధాలను వాడినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. ఆపరేషన్ రోరింగ్ లయన్ తో 2000 మంది ఇరానీ మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత సుమారు 4000 టార్గెట్లను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ వెల్లడించింది. ప్రాణాంతక రసాయన పదార్ధాలు ఉన్న ఇరానీ రీసర్చ్ , డెవలప్మెంట్ కేంద్రాన్ని తాజాగా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. తౌఫిక్ దారు కంపెనీ ఫెంటానిల్ను ఎస్పీఎన్డీ సంస్థకు సరఫరా చేసేదని, దానితో రసాయనిక ఆయుధాలను డెవలప్ చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
למעלה מ-800 מטסי תקיפה ו-16,000 חימושים: נתוני צה”ל במבצע ‘שאגת הארי’ עד כאן
לכל הפרטים👇https://t.co/RKFZ3cTlhz pic.twitter.com/O4ipi5n2sv
— צבא ההגנה לישראל (@idfonline) April 1, 2026
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటన చేసింది. సెంట్రల్ కమాండ్ ప్రతినిధి నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఇరాన్ వార్లో సుమారు 348 మంది అమెరికా మిలిటరీ సిబ్బందికి గాయాలు అయినట్లు వెల్లడించారు. దీంట్లో 315 మంది మళ్లీ సర్వీసు డ్యూటీలో చేరినట్లు చెప్పారు. ఆరుగురు మాత్రం తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఇక ఇరాన్ ప్రతీకార దాడుల్లో సుమారు 13 మంది అమెరికా సిబ్బంది మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది. మార్చి ఒకటో తేదీన కువైట్ పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని, ఆ దాడిలో 103వ సస్టేన్మెంట్ కమాండ్కు చెందిన ఆరుగురు సిబ్బంది మృతిచెందినట్లు చెప్పారు. ఇక మార్చి ఒకటో తేదీన సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై జరిగిన ఇరాన్ డ్రోన్ దాడిలో స్పేస్ ఫోర్స్కు చెందిన సర్జెంట్ మృతిచెందినట్లు తెలిపారు. ఇక కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ రీఫుయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ మార్చి 12వ తేదీన ఇరాక్లో కూలిందని, ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.