కీవ్, సెప్టెంబర్ 15: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత రాష్ట్రం క్రైవీ రిహ్లోని డ్యామ్ లక్ష్యంగా రష్యా క్షిపణులను ప్రయోగించింది. దీంతో డ్యామ్ దెబ్బతిన్నది. నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయికి పెరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోని రెండు జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది. దాదాపు 6 లక్షల మంది వరదముప్పునకు గురయ్యే అవకాశముంది. అప్రమత్తమైన అధికారులు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. జెలెన్స్కీ స్పందిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించి యుద్ధంలో గెలువాలని రష్యా ప్రయత్నిస్తున్నదని, దాని ఆటలు సాగవని హెచ్చరించారు.
కారు ప్రమాదంలో జెలెన్స్కీకి గాయాలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకొన్న ఇజియం నగరాన్ని జెలెన్స్కీ సందర్శించి రాజధాని కీవ్కు తిరిగి వస్తుండగా గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదానికి కారణమైన కారులోని వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, అతడిని అంబులెన్స్లో దవాఖానకు తరలించారు. ప్రమా దంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.