నివార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయం(Hindu temple)పై ఖలిస్తానీ మద్దతుదారులు భారత్కు వ్యతిరేకంగా గ్రాఫిటీ రాతలు రాశారు. నివార్క్లోని స్వామినారాయణ్ మందిరం గోడలపై ఆ గ్రాఫిటీ వేశారు. ఈ ఘటన పట్ల సమగ్ర విచారణ చేపడుతామని నివార్క్ పోలీసులు తెలిపారు. గోడలపై గ్రాఫిటీ రాతలకు చెందిన ఫోటోలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
ఆలయం గోడలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ప్రజలను భయపెట్టేందుకు గోడలపై విద్వేషపూరిత రాతలు రాసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొన్నది. నివార్క్ పోలీసుల ఈ ఘటనపై కేసును ఫైల్ చేశారు. విద్వేష నేరంగా ఈ ఘటనను దర్యాప్తు చేయాలని ఆ ఫౌండేషన్ కోరింది.