న్యూయార్క్, డిసెంబర్ 23: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసంచేశారు. భారత్పై వ్యతిరేకతతో ఖలిస్థానీ తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తున్నది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
నెవార్క్లోని శ్రీస్వామినారాయణ్ మందిరంపై శుక్రవారం ఉదయం 8.35 గంటల ప్రాంతంలో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసినట్టు చెప్పారు. ఈ దాడి ఘటనను శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయం ఖండించింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.