ఇస్లామాబాద్: పాకిస్థాన్లో (Pakistan) మైనార్టీలపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతున్నాయి. గత నెల 30న పెషావర్లో ఓ క్రిస్టియన్ మత బోధకుడు హత్యకు గురయ్యాడు. తాజాగా సింధు ప్రావిన్స్లో హిందూ వ్యాపారిని దుండగులు కాల్చి చంపేశారు. సోమవారం అర్ధరాత్రి సింధు ప్రావిన్స్లోని ఘోట్కీ జిల్లా దహర్కీలో సతన్ లాల్ అనే వ్యాపారిని గుర్తుతెలియన వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. సింధ్ ప్రావిన్స్లో నెల రోజుల వ్యవధిలో హత్యకు గురైన రెండో హిందూ వ్యాపారి.
జనవరి 4న కూడా సింధు ప్రావిన్స్ అనాజ్ మండీలో సునీల్ కుమార్ అనే హిందూ వ్యాపారిని దుండగులు హత్యచేశారు. అదేవిధంగా జనవరి 30న పెషావర్లో క్రిస్టియన్ మత బోధకుడిని కాల్చి చంపారు.