లూముట్: మలేషియా రెండు హెలికాప్టర్లు(Choppers Collide) ఢీకొన్నాయి. మిలిటరీ పరేడ్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లూముట్ నావల్ బేస్ వద్ద ఈ ఘటన జరిగింది. మలేషియన్ నేవీ పరేడ్ కోసం అక్కడ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.32 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. బాధితులు అందరూ మృతిచెందినట్లు ద్రువీకరించారు. లూముట్ ఆర్మీ బేస్ ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు.
BREAKING: 🇲🇾 2 military helicopters crash after mid-air collision in Malaysia, killing all 10 people on board pic.twitter.com/ckiEaqnd4R
— Megatron (@Megatron_ron) April 23, 2024