లండన్, మార్చి 20: గుండె పోటు ముప్పును రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే గుర్తించవచ్చని ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనం వెల్లడించింది.‘న్యూరో పప్టైడ్-వై (ఎన్పీవై) అనే ప్రొటీన్, దాంతోపాటు బీఎన్పీ అనే హార్మోన్ రక్తంలో ఏ మేరకు ఉన్నాయన్నది కొలవటం ద్వారా గుండె పోటు వచ్చే రోగులను గుర్తించవచ్చు. వీరు మరణించే ముప్పు ఎక్కువ. ఎన్పీవై అనేది గట్టి సంకేతమని మా పరిశోధన చెబుతున్నది’ అని పరిశోధకులు తెలిపారు.