లండన్, సెప్టెంబర్ 4: ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ఆదివారం లండన్లో మూడో వివాహం చేసుకున్నారు. 68 ఏండ్ల హరీశ్ సాల్వే, త్రినాల వివాహ వేడుకకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, సునీల్ మిట్టల్, ఎల్ఎన్ మిట్టల్, ఎస్పీ లోహియా, గోపి హిందూజా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. తదితరులు వేడుకలో పాల్గొన్నారు. నిఘా చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణల కింద కులభూషణ్ యాదవ్ను పాకిస్థాన్ అరెస్టు చేయగా, అంతర్జాతీయ కోర్టులో భారత్ తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.