15 మంది మృతి
మెక్సికో, జూన్ 20: అమెరికా, మెక్సికో సరిహద్దుల వద్ద ముష్కరులు జరిపిన కాల్పుల్లో 15 మంది మృతి చెందారు. రెండు దేశాల సరిహద్దుల్లోని మెక్సికో నగరం రేనోసాలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. సరిహద్దు వద్ద ఉన్న వంతెన సమీపంలో పోలీసులపై ముష్కరులు దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. కానీ మిగిలిన వారిపై ముష్కరులు యాధృచ్ఛికంగానే కాల్పులు జరిపారా..? లేదా లక్ష్యంగా చేసుకుని కాల్చారా..? అన్నది తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనానంతరం భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి.