ఐజ్వాల్, ఏప్రిల్ 5: మిజోరంలోని సెర్చిప్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి భవన నిర్మాణం చేపట్టనున్నట్టు రాష్ర్టానికి చెందిన ఓ క్రిస్టియన్ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రతిపాదిత చర్చిని 23,809.52 చదరపు మీటర్లలో నిర్మించనున్నారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా ఉన్న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ బసిలికా ఉన్న స్థలం కంటే 809.52 చదరపు మీటర్లు ఎక్కువని గ్రూప్ చీఫ్ జైచావ్నా హ్లాండో పేర్కొన్నారు.