స్టాక్హోం, నవంబర్ 26: వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో స్వీడన్ విఫలమైందంటూ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ మండిపడ్డారు. తన సొంత దేశంపైనే 600 మంది పిల్లలతో కలిసి దావా దాఖలు చేశారు. భూతాపంపై చర్యలు తీసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యత ప్రభుత్వానికి ఉందని 2019లో నెదర్లాండ్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ దావా వేశారు.
స్వీడన్ వాతావరణ విధానాలు రాజ్యాంగాన్ని, మానవ హక్కులపై యురోపియన్ కన్వెన్షన్ను ఉల్లంఘిస్తున్నాయని దావాలో పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించడంలో స్వీడన్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.