వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకానమిస్ట్గా ఉన్న గీతా గోపినాథ్ ఆ పోస్టును వీడి వెళ్తున్నారు. మూడేళ్ల పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు సేవలు అందించిన ఆమె మళ్లీ హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్రం శాఖలో చేరనున్నారు. ఏడాది పాటు హార్వర్డ్ వర్సిటీకి లీవ్ పెట్టివచ్చిన గీతా గోపినాథ్.. ఐఎంఎఫ్లో మూడేళ్లు పాటు పనిచేశారు. ఐఎంఎఫ్లో పరిశోధనా విభాగానికి ఆమె అధిపతిగా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ నివేదికలను ఆమె ఆధ్వర్యంలోనే తయారయ్యేవి. జీడీపీ అంచనాల నివేదికలను ఆమె తయారు చేసేవారు. చీఫ్ ఎకనామిస్ట్ పోస్టులో పని చేసిన తొలి మహిళ గీతా గోపినాథ్ అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జీవా ప్రశంసించారు. కరోనా మహమ్మారి వేళ ఆర్థిక రిపోర్ట్లను వెల్లడించినట్లు క్రిస్టలినా తెలిపారు. ఐఎంఎఫ్కు గీత చేసిన సాయం అసాధారణమైందన్నారు. అమెరికా, భారత్లో పౌరసత్వం ఉన్న గీతా గోపినాథ్.. 2018 అక్టోబర్ లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్గా నియమితులయ్యారు.