టెల్ అవివ్: హమాస్, ఇజ్రాయిల్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూను కలిసేందుకు వెళ్లిన జర్మనీ ఛాన్సలర్(German chancellor) ఓలాఫ్ స్కల్జ్ దాదాపు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. టెల్ అవివ్పై రాకెట్ల దాడి జరిగిన సమయంలో బాంబు షెల్టర్ లో ఓలాఫ్ స్కల్జ్ దాక్కోవాల్సి వచ్చింది. గాజా నుంచి వస్తున్న రాకెట్ల దాడి నుంచి తప్పించుకునేందుకు జర్మనీ ఛాన్సలర్ కు చెందిన బృందాన్ని కూడా విమానాన్ని దించేశారు. టెల్ అవివ్లో ఉన్న బెన్ గురియన్ ఎయిర్పోర్టు లో ఎయిర్ రైడ్ ఆలరమ్ మోగించారు. జర్మనీ రిపోర్టర్ సారా సివరేట్ తన ఫోన్తో కొంత ఫూటేజ్ తీశారు. ఎయిర్పోర్టు లో విమానం నుంచి జర్నలిస్టులను దించేసి టర్మాక్పై తలదాచుకున్న వీడియోను విడుదల చేశారు.
#Raketenalarm in Tel Aviv. Die Regierungsmaschine wird umgehend evakuiert. @Bundeskanzler wird in einen Schutzraum gebracht. Wir legen uns vor dem Flugzeug auf den Boden. @robinalexander_ @frautoroxel pic.twitter.com/OTWV55KUoA
— Sara Sievert (@sara__si) October 17, 2023
రాకెట్ల దాడి సమయంలో జర్మనీ ఛాన్సలర్ స్కల్జ్ ను నేలపై పడుకోబెట్టారని కొన్ని రిపోర్టులు వచ్చాయి. అయితే సమీపంలో ఉన్న షెల్టర్కు ఆయన్ను తీసుకువెళ్లారని జర్నలిస్టు రాబిన్ అలెగ్జాండర్ తెలిపారు. విమానం నుంచి అందర్నీ ఖాళీ చేయించిన తర్వాత మళ్లీ కొంత సమయానికి జర్మనీ ఛాన్సలర్ను ఆ విమానం ఎక్కించారు. తన కండ్లతోనే జర్మనీ ఛాన్సలర్ ఆకాశంలో ప్రత్యక్షంగా రాకెట్ల దాడిని చూశారని జర్మనీ మీడియా తెలిపింది. నాటకీయ పరిణామాల మధ్య జర్మనీ బృందం కైరోకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Kanzlermaschine in Tel Aviv vor Abflug geräumt, weil Alarm. Alle liegen auf Rollfeld für Deckung. Zwei Raketen erkennbar von Iron Dome getroffen über Flughafen. @welt pic.twitter.com/vZfqLGQQYY
— Robin Alexander (@robinalexander_) October 17, 2023
టెల్ అవివ్ పర్యటన సమయంలో.. ఛాన్సలర్ స్కల్జ్ అనేక సార్లు జర్మనీ ఎంబసీలో షెల్టర్ తీసుకున్నారు. అక్టోబర్ ఏడవ తేదీన గాజాపై హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ ఘటన తర్వాత ఇజ్రాయిల్కు వచ్చిన తొలి పశ్చిమ దేశాధినేతగా స్కల్జ్ నిలిచారు. హమాస్ ఉగ్రవాదులు నేటి తరం నాజీలు అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ తెలిపారు. నాజీలను ఓడించేందుకు ప్రపంచ ఏకం అవుతుందన్నారు.