టెల్ అవివ్: గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయిల్పై భీకర దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ అటాక్లో వందల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ దాడి సమయంలో అహ్మద్ అల్ గుఫేరీ అనే వ్యక్తి టెల్ అవివ్లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నాడు. దాడుల వల్ల అతను ఇంటికి వెళ్లలేకపోయాడు. అయితే గాజా(Gaza) సిటీపై డిసెంబర్ 8వ తేదీన జరిగిన అటాక్లో తన ఫ్యామిలీని అతను కోల్పోయాడు. ఆ అటాక్లో సుమారు 103 మంది బంధువుల్ని కూడా అతను కోల్పోయినట్లు తెలుస్తోంది.
రోడ్లను మిలిటరీ మూసివేసిన తర్వాత అతను కేవలం తన ఫ్యామిలీతో ఫోన్లో మాత్రమే మాట్లాడేవాడు. తన భార్య షిరీన్కు ఫోన్ చేసేవాడు. కానీ డిసెంబర్ 8వ తేదీన జరిగిన దాడిలో తన భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలను కోల్పోయాడతను. ఆ బాంబు దాడిలోనే అహ్మద్ తల్లి, అతని నలుగురు సోదరులు, కుటుంబసభ్యులు కూడా చనిపోయారు. ఆ రోజు జరిగిన అటాక్లో అత్తలు, మామలు, సోదరులు.. మొత్తం సుమారు వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అహ్మద్ తెలిపారు. ఇంకా కొందరి మృతదేహాలు శిథిలాల కింద ఉన్నట్లు చెప్పాడు.
తొలుత ఓ మిస్సైల్ తమ ఇంటి గేటు వద్ద పడిందని, దాని నుంచి తప్పించుకున్న తన భార్యా పిల్లలు.. మామ ఇంటికి పరిగెత్తారని, కానీ 15 నిమిషాల తర్వాత ఓ ఫైటర్ జెట్ ఆ ఇంటిని పేల్చివేసిందన్నారు. దాడుల సమయంలో బయటకు పరుగెత్తిన వాళ్లు బ్రతికిపోయారని, ఇంట్లోనే దాచుకున్నవాళ్లు ఆ దాడిలో నేలమట్టం అయినట్లు ఓ ఫ్యామిలీ సభ్యుడు తెలిపాడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఓ ఇంటిని టార్గెట్ చేస్తూ అటాక్ చేశారన్నాడు. గుఫేరి కుటుంబానికి చెందిన ఇండ్లపై జరిగిన దాడుల్లో 103 మంది మరణించినట్లు తేలింది.
అహ్మద్ అల్ గుఫేరీ ప్రస్తుత పరిస్థితి గుండెల్ని పిండేస్తోంది. తన ఫ్యామిలీ సభ్యుల్ని అతను కోల్పోయాడు. భర్త, పిల్లలు, తల్లి, అత్తమామ, సోదరులు అందర్నీ అటాక్లో చనిపోయారు. ఆ విషాద ఘటన నుంచి అహ్మద్ తేరుకున్నా.. అతని ఆవేదనను తీర్చేవారులేరు. నేటికి కూడా అక్కడ బాంబుల మోత మోగుతూనే ఉన్నది.
రాబోయే రంజాన్ మాసం సమయంలో.. యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ముస్లింల పవిత్ర మాసం సందర్భంగా ఆ రోజుల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. రంజాన్ వేళ ఎటువంటి ఆయుధాలు వాడరాదు అని ఇజ్రాయిల్తో ఒప్పందం కుదిరినట్లు బైడెన్ తెలిపారు.