న్యూయార్క్: క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల్ని మోసం చేసిన FTX వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్ .. 250 మిలియన్ డాలర్ల బెయిల్పై రిలీజ్ అయ్యాడు. సుమారు రెండు మిలియన్ల డాలర్ల మేరకు బ్యాంక్మాన్ .. ఇన్వెస్టర్లను బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మన్హట్టన్ జడ్జి.. ఫ్రైడ్కు బెయిల్ను మంజూరీ చేశారు. న్యూయార్క్ జైలుకు బదులుగా అతను కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచే విచారణకు హాజరుకానున్నారు.
ఫెడరల్ కోర్టు చరిత్రలోనే అత్యధిక బాండ్ చెల్లించిన బెయిల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్మాన్ పేరెంట్స్ అతనికి సెక్యూర్టీ డిపాజిట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. బ్యాంక్మాన్ ఫ్రైడ్ను వారం రోజుల క్రితం బహమాస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బహమాస్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్టీఎక్స్ సంస్థ గత నెల 11వ తేదీన దివాళా ప్రక్రియ చేపట్టాలని కోరింది.
క్రిప్టో కరెన్సీ కస్టమర్లు చేసిన డిపాజిట్లను ఎఫ్టీఎక్స్ తన సొంత కంపెనీ అలమెడా రీసెర్చ్లో మిక్స్ చేయడంతో వివాదం తలెత్తింది. ఆ తర్వాత ఎఫ్టీఎక్స్ భారీగా పతనమై.. పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అమెరికా, బహమాస్ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు బ్యాంక్ మాన్ ఫ్రైడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు దేశాల్లోనూ ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు బ్యాంక్ మాన్ మీద అభియోగాలు నమోదయ్యాయి.