జెరుసలాం : ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడులు ఏడో రోజుకు చేరుకున్నాయి. తాజాగా టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం(Tehran Airport)పై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో విమానాలు దగ్ధం అయ్యాయి. భారీ ఎత్తున ఆ విమానాశ్రయం నుంచి నల్ల పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్లో అత్యంతి బిజీ ఎయిర్పోర్టు అది. వైమానిక బాంబు దాడులు జరిగిన సమయంలో ఆ విమానాశ్రయంలో చాలా వరకు విమానాలు పార్క్ చేసి ఉన్నట్లు శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తెలిసింది. ఎయిర్పోర్టులోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా పేర్కొన్నది. చాలా విస్తృత స్థాయిలో దాడులు చేయనున్నట్లు శుక్రవారం ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. మార్చి 4వ తేదీన కూడా ఇదే విమానాశ్రయాన్ని టార్గెట్ చేశారు. ఆ దాడి వల్ల అక్కడ ఉన్న డిఫెన్స్, డిటెక్షన్ సిస్టమ్స్ ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పేర్కొన్నది. తాజా సమాచారం ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు సుమారు 1332 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
JUST IN: The moment 🇮🇷 Iran’s Mehrabad International Airport hit by massive US-Israeli airstrikes.
🚩More details.. Follow #Iran #IranWar2026 #TelAviv #füze #IranIsraelWar #IsraelIranWar pic.twitter.com/iKXhgVDs5z
— 𝐑ated 𝖎nsights 🎖 (@RatedInsights) March 7, 2026