లాస్ఏంజెల్స్: అమెరికాలో ఘోరం జరిగింది. కిడ్నాప్నకు గురైన భారత కుటుంబం హత్యకు గురైంది. మొత్తం నలుగురు మరణించగా.. వీరిలో 8 నెలల చిన్నారి కూడా ఉన్నది. వీరి మృతదేహాలను ఓ తోటలో గుర్తించారు. పంజాబ్కు చెందిన జాస్దీప్సింగ్ (37) కాలిఫోర్నియాలో ట్రక్కు వ్యాపారాన్ని ప్రారంభించారు. సోమవారం భార్య జాస్లీన్ కౌర్ (27), కుమార్తె అరూహి (8), బంధువు అమన్దీప్ సింగ్ (39)తో కలిసి కార్యాలయానికి వెళ్లారు. ఓ దుండగుడు ఈ నలుగురిని కిడ్నాప్ చేశాడు.
అనంతరం ఓ ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్లారు. ఇండియానా రోడ్డు-హట్చిన్సన్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ తోటలో నలుగురి మృతదేహాలను గుర్తించిన వ్యవసాయ కూలి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడు సాల్గడోని అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో అమెరికాలో భారత సంతతి విద్యార్థి పర్డ్యూ వర్సిటీలోని మెక్కట్చెన్ హాల్లో హత్యకు గురయ్యాడు. దక్షిణకొరియాకు చెం దిన అతడి సహచరుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.