ఇస్లామాబాద్: తోషాఖానా (కానుకల ఖజానా) అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు మూడేండ్ల జైలు శిక్ష పడింది. దీంతో పోలీసులు ఆయనను వెంటనే అరెస్టు చేశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన ఖరీదైన బహుమతువిషయంలో అవినీతి జరిగినట్టు కేసు నమోదైంది. దీనిపై శనివారం పాక్లోని ఓ కోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఇమ్రాన్పై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపితమయ్యాయని చెప్పారు. క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేండ్లపాటు నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉంది.