ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం పట్ల ప్రజలందరూ వణుకుతుంటే.. మరోపక్క కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇతరులకు కూడా ముప్పు తెస్తున్నారు. తాజాగా బ్రిటన్లో ఇలాంటి ఘటనే జరిగింది. సాక్షాత్తు యూకే ప్రభుత్వ విదేశాంగ శాఖ సెక్రటరీనే పార్లమెంటులో మాస్కు లేకుండా కూర్చుంది.
యూకేలో హౌస్ ఆఫ్ కామన్స్లో నేతలందరి మధ్య మాస్కులేకుండా కూర్చుందామె. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆమెకు కరోనా సోకిందని తేలింది. హౌస్ ఆఫ్ కామన్స్లో జరిగిన మీటింగ్లో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘనలపై క్షమాపణలు కూడా చెప్పారు.
ఆ మీటింగ్ తర్వాత విదేశాంగ శాఖ సెక్రటరీ లిజ్ ట్రస్కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో తాను ప్రస్తుతం హోం ఐసొలేషన్లో ఉన్నట్లు ఆమె తెలిపింది. మంగళవారం నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిసేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్తోపాటు వెళ్లే బృందంలో ఆమె పేరు కూడా ఉండటం గమనార్హం. కానీ కరోనా సోకడంతో ఆమె ఈ భేటికి దూరంకానుంది.