న్యూఢిల్లీ: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా రిలీజైంది. 36వ వార్షిక ర్యాంకింగ్ వివరాలను వెల్లడించారు. తాజా జాబితాలో 2668 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ మొత్తం మంది సంపన్నుల ఆస్తులు సుమారు 12.7 ట్రిలియన్ల డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది. 2021తో పోలిస్తే ఇది 400 బిలియన్ డాలర్లు తక్కువే. ఫోర్బ్స్ జాబితా నుంచి రష్యా, చైనా దేశాలకు చెందిన సుమారు 34 మంది తగ్గిపోయారు. ఏడాది క్రితంతో పోలిస్తే సుమారు వెయ్యి మంది బిలియనీర్లు ఈ ఏడాది మరింత సంపన్నులుగా మారారు.
గత ఏడాదిలో కొత్తగా 236 మంది బిలియనీర్లు అయ్యారు. బార్బడోస్, బల్గేరియా, ఎస్టోనియా, ఉరుగ్వే లాంటి దేశాలకు చెందిన వాళ్లు తొలిసారి ఈ జాబితాలో చేరారు. అమెరికాకు చెందిన 735 మంది ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఉన్నారు. వారి సంపద సుమారు 4.7 ట్రిలియన్ల డాలర్లు. ఆ లిస్టులో ఎలన్ మస్క్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో మస్క్ టాప్ ప్లేస్లో ఉన్నారు. చైనా, హాంగ్కాంగ్, మకావ్కు చెందిన 607 మంది బిలియనీర్లు జాబితాలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 11వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు.
టాప్ 15 లిస్టు..
ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, లారీ పేజ్, సర్గే బ్రిన్, లారీ ఎలిసన్, స్టీవ్ బార్మర్, ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, మైఖేల్ బ్లూమ్బర్గ్, కార్లోస్ స్లిమ్ హేలూ, ఫ్రాంకోస్ బెటన్కోర్ట్ మేయర్స్ అండ్ ఫ్యామిలీ, మార్క్ జుకర్బర్గ్.