జెనీవా: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్లో (Yemen) ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పనిముగించుకుని అడెన్కు తిరిగి వస్తుండగా దుండగులు వారిని కిడ్నాప్ చేశారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్లో ఐరాసా అధికారి రస్సెల్ గీకీ తెలిపారు.
కాగా, యెమెన్లో 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్కు చెందిన హౌతీ గ్రూప్కి మధ్య పోరు జరుగుతున్నది. 2015లో యెమెన్లోని ప్రభుత్వాన్ని హౌతీలు కూల్చివేశారు. అప్పటి నుంచి రాజధాని సనాలో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఈ క్రమంలో పదివేలకు పైగా మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.