టెల్ అవివ్: ఇజ్రాయిల్లోని టెల్ అవివ్ శివారులో కాల్పుల ఘటన జరిగింది. ఓ దుండగుడు అయిదుగుర్ని కాల్చివేశాడు. గడిచిన వారం రోజుల్లో ఇలాంటి దాడి జరగడం ఇది మూడవసారి. బినెయి బ్రాక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడే సాంప్రదాయ యూదులు అధిక సంఖ్యలో ఉంటారు. సాయు|ధుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇటీవల ఇజ్రాయిలీ అరబ్లు అటాక్ చేయడంతో సెక్యూర్టీ దళాలు హై అలర్ట్లో ఉన్నాయి. రెండు దాడుల్లో ఆరుగురు మృతిచెందారు. నల్ల దుస్తులు ధరించి, చేతిలో అటోమెటిక్ వెపన్తో ఉన్న వాహనంపై వచ్చిన ఆ దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. ఒకరు వాహనంలో చనిపోగా, మరికొంత మంది వీధుల్లో శవాల దిబ్బగా మారారు. ఈ ఘటన తర్వాత ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇజ్రాయిల్లో అరబ్ ఉగ్రవాదం పెరిగినట్లు ఆయన ఆరోపించారు. సెక్యూర్టీ దళాలు రంగంలోకి దిగాయని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామన్నారు. దాడిని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు.