లండన్: ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ధృవీకరించారు. ఇవాళ పశ్చిమ లండన్లోని పడింగ్టన్ సమీపంలో ఓ వ్యాక్సినేషన్ క్లినిక్ను సందర్శించిన బోరిస్ జాన్సన్.. ఒమిక్రాన్వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ఈ వేరియంట్ బారినపడి ఒక వ్యక్తి మరణించడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.
‘ఈ ఒమిక్రాన్ వేరియంట్ మధ్యరకం వెర్షన్ అని నేను భావిస్తున్నా. ఈ వేరియంట్ మరింత విస్తరించకుండా అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది. జనాల్లో ఇది ఎంత వేగంగా విస్తరిస్తున్నదో గుర్తించాల్సిన అసవరం ఉన్నది. అదేవిధంగా ఈ వేరియంట్ కట్టడికి అందరికీ బూస్టర్ డోస్లు అందించడమే ఉత్తమం అనేది నా అభిప్రాయం’ అని బోరిస్ జాన్సన్ చెప్పారు.