ఎనిమిది మంది మృతి.. వారిలో నలుగురు మహిళలు
దేశంలో కరోనా వ్యాప్తికి కారణమన్న అపోహతో దుశ్చర్య
అట్లాంటా/ఫినిక్స్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి ఆసియా దేశాలకు చెందిన వారే కారణమన్న విద్వేషంతో జరుగుతున్న దాడుల్లో మరో దారుణం సంభవించింది. మూడు మసాజ్ పార్లర్లలో విచ్చలవిడిగా ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. వీరిలో ఆరుగురు ఆసియన్లే. వీరిలో నలుగురు దక్షిణ కొరియా మహిళలు. జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలోని రెండు పార్లర్లలో, అట్లాంటాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వుడ్స్టాక్లోని మరో పార్లర్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న 21 ఏండ్ల రాబర్ట్ ఆరోన్ లాంగ్ను పోలీసులు గాలించి పట్టుకున్నారు.
అమెరికాలోని ఫినిక్స్లో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. కాల్పులకు కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విస్కాన్సిన్లోని గోడౌన్లో జరిగిన మరో ఘటనలో ఓ కార్మికుడు కాల్పులు జరపడంతో తోటి కార్మికులు ఇద్దరు మరణించారు.